Two died After Consuming Alcohol: పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో పుల్లారెడ్డి(62), అంజిరెడ్డి (61) అనే ఇద్దరు మృతి చెందారు. అయితే చనిపోవడానికి ముందు వారిద్దరూ బెల్ట్ షాప్లో మద్యం కొని సేవించారని మృతుల బంధువులు చెబుతున్నారు. కల్తీ మద్యం తాగడం వల్లే చనిపోయినట్లుగా బంధువుల ఆరోపిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/bjp-chief-about-pocso-case-against-bandi-bhagirath/
ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

