Vijayawada: ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇంద్రకిలాద్రి అర్చుకులపై వేటు పడింది. దేవస్థానం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు అర్చకులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో శీనా నాయక్ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 25 రాత్రి మల్లేశ్వరస్వామి ఆలయంలో మూడో షిఫ్ట్లో ఉండాల్సిన ఉప ప్రధాన అర్చకుడు పి.శ్రీనివాస శర్మ విధుల్లో గైర్హాజరు కాగా పరిచారకుడు.
విధులకు గైర్హాజరు..
కె.నాగరాజు కూడా విధుల్లో లేనట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆలయ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఈవో ఈ విషయాన్ని గుర్తించి ఇరువురిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. సిబ్బంది తమకు కేటాయించిన విధుల్లో కచ్చితంగా ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈవో హెచ్చరించారు.
Also Read: Jagga Reddy: జగ్గారెడ్డి అక్రమ రవాణా కేసులో కోర్టు కీలక తీర్పు

