ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ విజయసాయిరెడ్డికి(Vijayasai Reddy) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న విజయవాడలోని తమ ఆఫీసులో విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఒకరోజు ముందుగానే విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు విజయసాయి సమాచారం అందించారు. అంటే ఈనెల 17న విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈనెల 18న తనకు ఇప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉందని పేర్కొన్నారు. కానీ యథాప్రకారం ఏప్రిల్ 18వ తేదీనే హాజరయ్యారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని సాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు.