విజయవాడలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. కొండచరియలు పనుల్లో భాగంగా ఈనెల 6, 7, 8వ తేదీల్లో దుర్గగుడి ఘాట్రోడ్డు మూసివేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మరమ్మతుల దృష్ట్యా భక్తులు కనకదుర్గానగర్ మార్గం నుంచి వెళ్లాలని సూచించారు. పున్నమిఘాట్లో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేయనున్నారు.
Vijayawada: మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి ఘాట్రోడ్డు మూసివేత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES