Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Vijayawada: శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం

Vijayawada: శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం

శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న అష్టోత్తర శత కుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం మహా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ కు శేష వస్త్రం అందజేసి.. వేదాశీర్వచనాలతో స్వాగతం పలికారు వేద పండితులు, ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ శ్రీరాము సత్యనారాయణ.

- Advertisement -

అభిషేక మండపంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పట్టుచీర సమర్పించారు జగన్‌. అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు పాల్గొన్నారు. పలువురు పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు సీఎం వైయస్‌.జగన్‌.

పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు హోంశాఖ మంత్రి తానేటి వనిత, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి దంపతులు, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News