Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Ys. Jagan : అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ షాక్

Ys. Jagan : అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ షాక్

Ys. Jagan : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురిపై నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ కేసులో నిందితులలో ఒకటైన వాన్ పిక్ సంస్థ, తమను కేసు నుంచి తప్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ కు హైకోర్టు నిరాకరించింది. ఈ తీర్పుతో కేసు విచారణలో మరో మలుపు తిరిగినట్లైంది.

- Advertisement -

వాన్ పిక్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
వై.ఎస్. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఛార్జిషీట్‌లో వాన్ పిక్ సంస్థ ఒక నిందితునిగా ఉంది. ఈ సంస్థకు అప్పట్లో ప్రకాశం జిల్లాలో భారీగా భూములను కేటాయించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తమను కేసు నుంచి విముక్తం చేయాలని కోరుతూ వాన్ పిక్ సంస్థ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో, సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు తాజాగా వాన్ పిక్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Free Bus : ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్‌డేట్

విచారణను ఆలస్యం చేస్తున్న పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులు వరుసగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తూ విచారణను ఆలస్యం చేస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, సుప్రీంకోర్టు కూడా కేసుల విచారణను రోజువారీగా జరపాలని సీబీఐ కోర్టులకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడంతో కేసు విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం జగన్ కేసుల భవిష్యత్ విచారణపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad