Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Yaganti: ఉమామహేశ్వరుడికి టీటీడీ పట్టువస్త్రాలు

Yaganti: ఉమామహేశ్వరుడికి టీటీడీ పట్టువస్త్రాలు

మహాశివరాత్రి సందర్భంగా యాగంటి ఉమామహేశ్వరస్వామి వారికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను టీటీడీ పాలక మండలి సభ్యులు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి సమర్పించారు. యాగంటి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారిగా టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను సమర్పించడం ఇదే మొదటిసారి. ఉదయం టీటీడీ మరో పాలకమండలి సభ్యుడు మారుతీ ప్రసాద్ దంపతులు తిరుమల నుంచి పట్టువస్త్రాలను తీసుకురాగా వాటిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి దంపతులు మేళతాలతో, ఆలయ ప్రధాన అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి గర్భగుడిలో స్వామివారికి సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News