Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్YCP leaders met Jagan: జగన్ ను కలిసిన వైసీపీ నేతలు

YCP leaders met Jagan: జగన్ ను కలిసిన వైసీపీ నేతలు

20న విస్తృతస్థాయి సమావేశం

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్‌.జగన్‌ను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు.

- Advertisement -

ఈనెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి కార్యక్రమాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

  1. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈనెల 22కు బదులుగా ఈనెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీచేసిన అభ్యర్థులు హాజరవుతారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు.
  2. అలాగే నేటి పులివెందుల పర్యటనను వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి వాయిదా వేసుకున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News