మహా శివరాత్రి(Maha Shivaratri) వేడుకల వేళ తీవ్ర విషాదం నెలకొంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున నదీస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ దుర్ఘటన అందరినీ కలిచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా.. మిగిలిన మృతదేహాల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పండుగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకోవడంతో యువకుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. గల్లంతైన వారిలో తిరుమలశెట్టి పవన్(19), పడాల దుర్గాప్రసాద్(17), అనిశెట్టి పవన్(19), గర్రె ఆకాష్(17), పడాల సాయి(19) ఉన్నారు.
Maha Shivaratri: మహాశివరాత్రి వేళ తీవ్ర విషాదం.. యువకులు గల్లంతు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES