Thursday, June 19, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Jagan: ఏపీని మరో బీహార్‌గా మారుస్తున్నారు.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్

YS Jagan: ఏపీని మరో బీహార్‌గా మారుస్తున్నారు.. సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్

YS Jagan Comments: వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రశ్నిస్తే అరెస్టులు.. బెదిరింపులు.. రాష్ట్రంలో ఇదే జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఏడాదిగా లిక్కర్ కేసులో చెవిరెడ్డి పేరు ఎక్కడైనా బయటికి వచ్చిందా..? అని ప్రశ్నించారు. ఆయన గన్‌మ్యాన్‌ను చితకొట్టి తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారని ఆరోణలు చేశారు. అక్రమ అరెస్టులతో రాష్ట్రాన్ని మరో బీహార్ చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.

- Advertisement -

ఇప్పటికే అనేక మంది వైసీపీ నేతలను అరెస్ట్ చేశారని తెలిపారు. ఇక మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, విడదల రజిని వంటి నేతలను కూడా అరెస్టు చేసేందుకు వేధిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసనలకు ప్రజల్లో విశేష స్పందన వచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు.

70 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు తనను భూస్థాపితం చేస్తా అంటున్నారని.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాటలేంటి..?అని ధ్వజమెత్తారు. మీరు చేసిన మోసాలను ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా అని నిలదీశారు. పల్నాడులో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం తప్పా..? అని ప్రశ్నించారు. తన పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెట్టారన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కార్యకర్తలు, ప్రజల నుండి తన పర్యటనకు విశేష స్పందన వచ్చింద‌ని జ‌గ‌న్ వెల్లడించారు.

ఇక సూపర్ సిక్స్ అమలు హామీలు చేయకుండా మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు, 50 ఏళ్ళకు పెన్షన్, మహిళలకు రూ.1500 పథకాలు అమలు చేయరా అని ప్రశ్నించారు. తల్లికి వందనం పేరిట తల్లులను వంచన చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది పిల్లలకు రూ.13,111 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.8,700 కోట్లు ఇస్తున్నారని విమర్శించారు. ఇది పచ్చి మోసం అంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు వర్షం కురిపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News