Tuesday, March 18, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: జగన్ చేసిన తప్పే చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల

YS Sharmila: జగన్ చేసిన తప్పే చంద్రబాబు చేస్తున్నారు: షర్మిల

ఆనాడు జగన్ చేసిన తప్పే నేడు సీఎం చంద్రబాబు చేస్తున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. కూటమి ప్రభుత్వం మహానేత YSR పేరు చెరిపి కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు.

- Advertisement -

“అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తీరు. ఆనాడు జగన్ గారు చేసిన తప్పే నేడు చంద్రబాబు గారు చేస్తున్నారు. అధికారంలో ఉండగా స్వర్గీయ NTR పేరు మార్చి YCP ప్రభుత్వం అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహానేత YSR పేరు చెరిపి ప్రతీకారం తీర్చుకుంటుంది. కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచింది.

YSR జిల్లాను తిరిగి YSR కడప జిల్లా పేరుతో సవరించడంలో అభ్యంతరం లేకపోయినా.. కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తీసెయ్యడాన్ని ఖండిస్తున్నాం. YSR అంటే ఎందుకింత కక్ష అని అడుగుతున్నాం. YSR జిల్లాలో తిరిగి కడప పేరు చేర్చినప్పుడు విజయవాడ కేంద్రంగా ఉన్న NTR జిల్లాకు NTR విజయవాడ అనో లేక పాత కృష్ణ జిల్లాకు NTR కృష్ణా జిల్లాగా పేరు ఎందుకు మార్చలేదు అని అడుగుతున్నాం.

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. దేశంలోనే సంక్షేమ పథకాలకు ఆధ్యుడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నేత. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు , పెన్షన్లు లాంటి ప్రజాకర్షక పథకాలకు రూపశిల్పి మహానేత YSR. తెలుగు వారు తమ గుండెల్లో గుడి కట్టుకొని, ఇంట్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్సార్ ఫోటో పెట్టుకొని పూజిస్తున్న గొప్ప నేతకు రాజకీయాలు ఆపాదించడం సరైంది కాదు. ఇది ఆయనకు ఇచ్చే గౌరవం అంతకన్నా కాదు. YSR అనే పేరు ప్రజల ఆస్తి. ఆయన ఏ ఒక్కరి సొత్తు కాదు. YSR తెలుగు వారి సొత్తు.” అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News