Sunday, June 22, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: శవ రాజకీయాలు చేస్తారా..? జగన్ పై షర్మిల ఘాటు విమర్శలు

YS Sharmila: శవ రాజకీయాలు చేస్తారా..? జగన్ పై షర్మిల ఘాటు విమర్శలు

YS Sharmila Comments on Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్బంగా ఆయన కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించండపై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

జగన్ వాహనం కింద పడి సింగయ్య నలిగిపోయిన దృశ్యాలు భయానకంగా.. ఒళ్ళు గగుర్పొడిచేలా ఈ ఘటన ఉందన్నారు. కారు కింద ఓ వ్యక్తి పడ్డారన్న సోయి కూడా లేకుండా కాన్వాయ్ కొనసాగడం ఏంటని ప్రశ్నించారు. 100 మందికి పర్మిషన్ ఇస్తే వేల మంది ముందు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్ ఆ చేతులూపడం ఏంటని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు జగన్ కు ఎవరిచ్చారని ఘాటుగా విమర్శించారు.

బెట్టింగ్ లో ఓడిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తి విగ్రహ ఆవిష్కరణకు ఇద్దరిని బలి ఇస్తారా? అని ప్రశ్నించారు. ఇదెక్కడి రాక్షస ఆనందం అని విమర్శించారు. జగన్ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా? అని ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాణాల మీద శవ రాజకీయాలు చేస్తారా అని ధ్వజమెత్తారు. కార్ సైడ్ బోర్డ్ మీద నిలబడి ఒక నాయకుడిగా కాన్వాయ్ మూవ్ చేయించడం సబబేనా? అని విమర్శలు చేశారు. ఇది పూర్తిగా జగన్ బాధ్యతరాహిత్యానికి అద్దం పడుతుందన్నారు. .

బలప్రదర్శన చేసి సింగయ్య మృతికి కారణమైన జగన్, 100 మందికి అనుమతి ఇచ్చి వేల మందితో వచ్చినా దగ్గరుండి మరి చోద్యం చూసిన కూటమి ప్రభుత్వం ఇందుకు బాధ్యత వహించాలన్నారు. పర్మిషన్ కి విరుద్ధంగా జన సమీకరణ జరుగుతుంటే పోలీసులు ఎలా సహకరించారని ఆమె ప్రశ్నించారు. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమైందన్నారు.

ప్రజా సమస్యలపై పోరాడే కాంగ్రెస్ పార్టీకి ఏమో ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ చేసే ఉద్యమాలకు, ధర్నాలకు హౌజ్ అరెస్ట్ లు చేస్తారని.. దీక్షలను భగ్నం చేస్తారని పేర్కొన్నారు. ర్యాలీలను తొక్కిపెట్టి తమ గొంతు నొక్కుతారన్నారు. అదే వైసీపీ చేసిన బలప్రదర్శనలకు, హత్యలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. కాగా ఈ ఘటనకు సంబంధించి జగన్ కాన్వాయ్ డ్రైవర్ రమణారెడ్డిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ2గా జగన్ పేరు చేర్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News