Thursday, May 1, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: ప్రధాని మోదీకి బహుమతిగా అమరావతి మట్టి: షర్మిల

YS Sharmila: ప్రధాని మోదీకి బహుమతిగా అమరావతి మట్టి: షర్మిల

ఏపీ రాజధాని అమరావతి పునః శంకుస్థాపన కార్యక్రమం రేపు(శుక్రవారం) ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ(PM Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి పున:శంకుస్థాపనకు వస్తున్న మోడీకి అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

“ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈసారైనా అమరావతి కట్టేనా ? లేక మళ్ళీ మట్టేనా ? 10 ఏళ్ల క్రితం మట్టి తెచ్చి మన నోట్లో కొట్టారు. మన ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపనకు వస్తున్న మోడీ గారికి ఇదే అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నాం. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015లో తొలి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలు గుర్తు రావాలి.10 ఏళ్లుగా చేసిన మోసంపై ఆత్మ విమర్శ చేసుకోవాలి. మోడీ గారు ఈ మట్టి సాక్షిగా ప్రమాణం చేసి అమరావతిలో అడుగుపెట్టాలి.

మరోసారి ఇలాంటి మోసం చేయనని ప్రమాణం చేయాలి. విభజన హామీల్లో రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఆ బాధ్యతకు కట్టుబడి ఉన్నానని, ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తా అని రాసి సంతకం పెట్టాలి. మాకు అప్పులు వద్దు. మా భావితరాల మీద ఆ భారం వద్దు. రాజధాని నిర్మాణం కోసం బేషరతుగా రూ.1.50 లక్షల కోట్లను 3 ఏళ్లలో కేంద్రం ఇవ్వాలి. ఈ ప్రకటన మోడీ గారు చేయాలి. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి. అలాగే 10 ఏళ్లుగా అమలుకు నోచుకోని విభజన హామీలపై స్పష్టత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News