Homeఆంధ్రప్రదేశ్YS Jagan: బాలయ్య ఇలాకాలో ఇద్దరు నేతల్ని సస్పెండ్ చేసిన వైఎస్ జగన్

YS Jagan: బాలయ్య ఇలాకాలో ఇద్దరు నేతల్ని సస్పెండ్ చేసిన వైఎస్ జగన్

YSRCP Press Release: వైయస్సార్ సీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ కీలక నే నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హిందూపూర్‌లో ఇద్దరు వైసీపీ నేతలను సస్పెండ్ చేశారు. వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంగా వారిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ ఇద్దరు నేతలు వైసీపీలో ఫస్ట్ నుంచి కీలకంగా వ్యవహరించారు.

వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపూర్ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా వేణుగోపాల్ రెడ్డి వ్యవహరించారు. అయితే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాలకృష్ణపై ప్రతర్థ్యిగా నవీన్ నిశ్చల్ పోటీ చేశారు. అదే విధంగా 2024లో బాలయ్యపై దీపిక పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతేడాది పోటీ చేసిన దీపికకు వేణుగోపాల్ రెడ్డి, నవీన్ నిశ్చల్ మద్దతుగా నిలిచిన మాట వాస్తవమే.

- Advertisement -

ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ.. రాబోయే 2029 ఎన్నికల్లో వైసీపీ తరఫున హిందూపూర్‌లో తానే పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే ఈ నియోజకవర్గానికి ఇంఛార్జ్ గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న దీపిక.. ఇదే విషయమై పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై సీరియస్ గా తీసుకున్నా వైసీపీ అధిష్టానం కీలక నేతలను సస్పెండ్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News