Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: లోకేష్ పాదయాత్రకు ప్రజల బ్రహ్మరథం

Yuvagalam: లోకేష్ పాదయాత్రకు ప్రజల బ్రహ్మరథం

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు గోనెగండ్ల మండల ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయానాగేశ్వర్ రెడ్డి అడ్వరులో గోనెగండ్ల సమీపంలోని గాజులదిన్నే క్రాస్ రోడ్డు నుండి ఉదయం 8 .20 గంటలకు లోకేష్ కాలినడక ప్రారంభించారు. హెచ్ కైరవాడి, పుట్టపాశం మీదుగా వేముగోడు గ్రామంకు మధ్యాహ్నం 11.45 నిమిషాలకు చేరుకున్నారు. భోజన విరామం తర్వాత సాయంకాలం 4 గంటలకు వేముగోడు , వర్కర్ మీదుగా కోడుమూరు కు చేరుకున్నారు. దీంతో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర మంగళవారం తో ముగిసింది.కోడుమూరు నియోజకవర్గంలో ప్రవేశించింది. వివిధ వర్గాల ప్రజల వినతులను లోకేష్ స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎంఎల్సీ బీ టీ నాయుడు, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News