Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Yuvagalam: నిరవాడ గ్రామ బ్రిడ్జిని నిర్మించండి

Yuvagalam: నిరవాడ గ్రామ బ్రిడ్జిని నిర్మించండి

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ప్రజలు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు నిరవాడ గ్రామం సమస్యల గురించి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం టిడిపి నాయకులు జాఫర్ మాట్లాడుతూ .. ఒక గంట వర్షం పడిన ఈ ఒక్కరి వాగు మీద రాకపోకలు నిలిచిపోతాయన్నారు. గత సంవత్సరం ఉదయం 11 గంటలకు సమయంలో నలుగురు వ్యక్తులు కర్నూలుకు జీవనోపాధి కోసం బయలుదేర గ ఒకరు మృతి చెందారని నారా లోకేష్ కు తెలియజేశారు. ఇంత జరిగిన ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదని వారు తెలియజేశారు. మా గ్రామ సమస్య ఒక్కెర వాగు బిర్జి ఎత్తు పెంచి నిర్మించాలని మమ్ములను మా రాబోవు తరాలను అందరిని కాపాడాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మా సమస్యను పరిష్కరించి బ్రిడ్జి నిర్మించాలని మనస్పూర్తిగా కోరుతున్నామని గ్రామ ప్రజలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News