Monday, July 14, 2025
HomeAP జిల్లా వార్తలుRottela Panduga: ఆ కోరిక తీరాలంటే ఈ రొట్టె తినాలి.. వైభవంగా పండుగ ప్రారంభం

Rottela Panduga: ఆ కోరిక తీరాలంటే ఈ రొట్టె తినాలి.. వైభవంగా పండుగ ప్రారంభం

Rottela Panduga: నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద ఏటా మొహర్రం నాడు రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ఈ రొట్టెల పండుగ ఆదివారం అత్యంత ఘనంగా ప్రారంభమైంది. భక్తులు తమ తమ కోరికలు నెరవేరాలని ఆశిస్తూ దర్గా వద్ద గల స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటున్నారు. ఈ విశిష్టమైన ఉత్సవంలో పాల్గొనడానికి దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో దర్గా ప్రాంగణంతో పాటు స్వర్ణాల చెరువు పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి.

- Advertisement -

నేటి నుంచి ఐదు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల కోసం భక్తులు భారీగా నెల్లూరుకు విచ్చేస్తున్నారు. తమ మనసులోని కోరిక నెరవేరాలని ఆశిస్తూ.. గతంలో కోరిక తీరిన వాళ్ల దగ్గర నుంచి రొట్టెను స్వీకరిస్తున్నారు. భక్తులు తాము కోరుకున్న కోరిక తీరితే ఇతరులకు రొట్టెలను ఇవ్వడం ఈ పండుగలోని ప్రధాన ఆచారం. రొట్టెల కోసం భక్తులు స్వర్ణాల చెరువులో పుణ్యస్నానాలు చేసి, భక్తిశ్రద్ధలతో రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటున్నారు.

అయితే రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాంగణంలో ప్రత్యేక టెంట్లు, ఉచిత భోజన వసతి, తాగునీటి సౌకర్యం కల్పించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులు అక్కడి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పండుగ ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల రాకతో దర్గా పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News