Bigg Boss Today Promo: బిగ్బాస్ హౌస్లో పోరు రసవత్తరంగా మారింది. కాగా.. 33వ ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ జరగనుంది. దీనికి సేఫ్ జోన్లో ఉన్న హౌస్మేట్స్ అందర్నీ కంటెండర్లుగా సెలక్ట్ చేశాడు బిగ్బాస్. రాము, ఇమ్మానుయేల్, భరణి, దివ్య, కళ్యాణ్, తనూజ ఈ టాస్కులో పోటీపడ్డారు. అయితే ఫిజికల్ టాస్క్ కాకుండా ఈసారి కాస్త లాజికల్ టాస్క్ పెట్టాడు బిగ్బాస్. అవతలి వ్యక్తి మైండ్లో ఏముందో గెస్ చేసి చెప్పే ఈ టాస్క్లో కళ్యాణ్ ఇరగదీశాడు. దీంతో హౌస్కి ఐదో కెప్టెన్ అయిపోయాడు. దీనికి సంబంధించిన ప్రోమో సూపర్ గా ఉంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.
కనుక్కోండి చూద్దాం..
బిగ్బాస్ సీజన్ 9 ఐదవ కెప్టెన్ అవ్వడానికి పోటీదారులకి ఇస్తున్న టాస్క్ ‘కనుక్కోండి చూద్దాం’.. అని బిగ్బాస్ ప్రకటించాడు. ఈ టాస్క్ ఏంటంటే పోటీదారులు అందరూ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చొని ఉంటారు. వారి నెత్తిన ఒక బల్డ్ వేలాడుతూ ఉంటుంది. బజర్ మోగినప్పుడల్లా సంచాలకులు ఛైర్స్లో కూర్చున్న పోటీదారుల్లో ఒకరిని ఎంచుకొని వారి భుజంపై టచ్ చేస్తారు. అప్పుడు ఆ పోటీదారులు తమ కళ్లకి ఉన్న గంతలు తీసి మిగిలిన సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని వారి లైట్ని ఆఫ్ చేయాలి. వెంటనే తిరిగి తమ ఛైర్లో కళ్లకి గంతలు కట్టుకొని కూర్చోవాలి. ఆ తర్వాత అందరూ గంతలు ఓపెన్ చేస్తారు. ఎవరి లైట్ అయితే ఆఫ్ చేసి ఉంటుందో వారు.. ఇది చేసిందెవరో గెస్ చేయాలి. వారు గెస్ చేసిన సభ్యులు లైట్ ఆఫ్ చేసిన సభ్యులు ఒకరే అయితే ఆ లైట్ ఆఫ్ చేసిన సభ్యులు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నమాట.. ఇది గేమ్.
సంచాలక్ గా సంజన
అయితే, ఈ టాస్క్కి సంజన సంచాలకురాలిగా ఉంది. ముందుగా రాముకి అవకాశం ఇచ్చింది సంజన. రాము నేరుగా వెళ్లి దివ్య లైట్ ఆఫ్ చేసి సైలెంట్గా కూర్చున్నాడు. ఇక గంతలు ఓపెన్ చేయగానే దివ్య ఠక్కున రాము పేరు చెప్పి షాకిచ్చింది. దీంతో రాము రేసు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత భరణిని టచ్ చేసి సంజన ఛాన్స్ ఇచ్చింది. భరణి వెళ్లి కళ్యాణ్ లైట్ ఆఫ్ చేశాడు. కళ్ల గంతలు తీయగానే కళ్యాణ్.. భరణి గారు అని చెప్పేశాడు. ఎందుకంటే కచ్చితంగా తనూజని ఆయన తియ్యాలని అనుకోరు.. దివ్యని తియ్యాలని అనుకోరు.. ఇక నేను ఇమ్మానుయేల్ వచ్చేసరికి నా కంటే ఎక్కడో కొంచెం మీకు ఇమ్మానుయేల్పైనే ఉంటుందని నేను అనుకుంటున్నా.. సో భరణి గారు.. అని కళ్యాణ్ చెప్పాడు. దీంతో, కళ్యాణ్ అనాలసిస్ కి భరణి అవాక్కయ్యాడు.
Read Also: Bigg Boss Suman Shetty: మంచోడికి కోపమొస్తే మసై పోతారు.. రెచ్చిపోయిన సుమన్ అన్న..!
రేసులో ఆ నలుగురు..
భరణి కూడా ఎలిమినేట్ అయిన తర్వాత ఇమ్మూ, దివ్య, కళ్యాణ్, తనూజ రేసులో మిగిలారు. తనూజకి ఛాన్స్ ఇవ్వగా వెళ్లి దివ్య లైట్ ఆఫ్ చేసింది. అయితే ఈసారి మాత్రం దివ్య తప్పుగా గెస్ చేసింది. కళ్యాణ్ అనుకుంటున్నాను.. మీరు సంచాలక్గా ఉన్నప్పుడు ఇమ్మానుయేల్ని ముందు రిస్క్లో పెట్టరు.. తనూజ నాకు తీయదు అనిపిస్తుంది.. అని దివ్య చెప్పింది. సో తప్పుగా చెప్పినందు వల్ల దివ్య కూడా ఔట్ అయింది. ఇక మిగిలిన ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అయ్యారనేది తర్వాత ఎపిసోడ్ లో తేలనుంది.


