Bigg Boss 9 Telugu: బుల్లితెరపై ఇప్పుడు బిగ్ బాస్ హవా కన్పిస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో హై టీఆర్పీతో దూసుకుపోతోంది. అయితే, తెలుగులో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షోకు ఫ్యాన్స్ తక్కువేమీ కాదు. ఇక షోలోని కంటెస్టెంట్లు నామినేషన్స్, టాస్కులు, గోడలు ఇలా ప్రతీదాంట్లో రచ్చరంబోలా చేస్తుంటారు. అయితే ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ దేశంలో పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ బిగ్బాస్ షోలకు మరోవైపు వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో వినిపిస్తోంది. కన్నడ హీరో కిచ్చా సుదీప్ఈ హోస్ట్గా వ్యవహరిస్తున్నకన్నడ బిగ్బాస్ షోపై కూడా ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ షో స్టూడియోను అధికారులు ఏకంగా సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు బిగ్బాస్ షో కూడా పీకల్లోతు చిక్కుల్లో పడింది. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
Read Also: Bigg Boss 9 Telugu: మరో వివాదంలో బిగ్ బాస్.. బ్యాన్ చేయాలంటూ కేసు.. ఆ ఇద్దరివల్లేనా?
బంజారాహిల్స్ లో కేసు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోపై బంజారాహిల్స్ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఈ షోపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా టీవీలో ప్రసారం అవుతున్న తెలుగు బిగ్ బాస్ షో పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ అనే వ్యక్తులు ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపణలు చేశారు. ఈ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని, కనీసం కుటుంబ విలువలు పాటించని వారిని బిగ్ బాస్ టీం ఎంచుకుంటున్నట్లు ఆరోపించారు.
Read Also: Bigg Boss Bharani: ఆడోళ్ల చేతిలో దెబ్బలు పడాల్సింది.. అలా బతికిపోయా
ఫిర్యాదులో ఏముందంటే?
సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు షో నిర్వహిస్తున్న ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని, బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటక లో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చెయ్యాలని, నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చెయ్యాలని హితవు పలికారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని యువత ప్రశ్నిస్తున్నారు.


