Bigg Boss: లక్ ఎప్పుడు ఎవరికి ఎలా కలిసొస్తుందో చెప్పలేం. ముఖ్యంగా బిగ్బాస్లో లక్ అనేది కీ రోల్ పోషిస్తుంది. గత సీజన్ లో గౌతమ్ కృష్ట.. ఇలానే ఒక ఎలిమినేషన్ నుంచి లక్ వల్ల తప్పించుకున్నాడు. అప్పుడు మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకొని హౌస్ నుంచి బయటికొచ్చేశాడు. కానీ ఆ వారం ఓటింగ్ ప్రకారం గౌతమ్ చివరి స్థానంలో ఉన్నాడని.. లెక్క ప్రకారం గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉందని నాగార్జున అప్పుడు చెప్పారు. అలా ఎలిమినేషన్ నుంచి బయటపడి తర్వాత తన ఆటలో విశ్వరూపం చూపించి చివరికి ఆ సీజన్ రన్నరప్ అయ్యాడు గౌతమ్. ఇక సీజన్-9లో కూడా అలాంటి సీన్యే రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో అత్యంత తక్కువ ఓటింగ్ సాయికి పడింది. దీంతో ఈ వారం సాయి ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా శనివారం ఎపిసోడ్లో రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకున్నాడు.
Read Also: Gukesh Exits World Cup: చెస్ ప్రపంచ కప్ నుంచి గుకేష్ ఔట్..!
డబుల్ ఎలిమినేషన్
ఎంతగా చెప్పినా రాము వినకపోవడంతో.. నాగార్జున కూడా ఏం చేయలేక అతడ్ని హౌస్ నుంచి బయటికి పంపించేశారు. దీంతో ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉండకపోవచ్చని ఆడియన్స్ అనుకున్నారు. అలా సాయి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ బిగ్బాస్ టీమ్ మాత్రం ఈ వారం డబుల్ స్ట్రోక్కి సిద్ధమైంది. రాము సెల్ఫ్ ఎలిమినేషన్తో సంబంధం లేకుండా ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టింది. ఇలా ఓటింగ్ ప్రకారం చివరి స్థానంలో నిలిచిన శ్రీనివాస్ సాయి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నాడు. అంటే ఈ వారం రాముతో పాటు సాయి కూడా ఔట్ అవ్వబోతున్నాడన్నమాట. ఇలా ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో అటు ఆడియన్స్కి ఇటు కంటెస్టెంట్లకి షాక్ తగలబోతుంది. ఈ ఎలిమినేషన్ రౌండ్ భరణి-సాయి మధ్య జరగబోతుంది.
Read Also: Pathan:అన్ని సమయాల్లో దూకుడు మంచిది కాదు..పఠాన్ వార్నింగ్
సాయి గురించి..
నిజానికి ఈ వారం ఆల్రెడీ ఒక ఎలిమినేషన్ జరిగింది కాబట్టి సాయికి మరో ఛాన్స్ ఇవ్వాలంటే ఇచ్చి ఉండొచ్చు. కానీ బిగ్బాస్ టీమ్ అలా ఆలోచించలేదు. దీంతో ఈ వారం లక్ వచ్చినట్లే వచ్చి సాయికి కిక్ ఇచ్చింది. ఇప్పటికే లీకుల ప్రకారం సాయి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అదే జ మరోవైపు మొన్నే రీఎంట్రీ ఇచ్చిన భరణికి కూడా పెద్దగా ఓటింగ్ పడట్లేదు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా భరణి ఆటలో తనూజ-దివ్యల ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ల నుంచి దూరంగా ఉండాలని భరణి ఎంత ట్రై చేస్తున్న ఈ ఇద్దరూ మాత్రం వదలడం లేదు. వాళ్లు వాళ్లు గొడవ పడి మరీ భరణిని మధ్యలో బుక్ చేస్తున్నారు. దీంతో ఆడియన్స్ దృష్టిలో గేమ్ కన్పించట్లేదు.


