Sunday, July 7, 2024
Homeట్రేడింగ్IT firm: ఉద్యోగులకు కార్లు గిఫ్టుగా ఇచ్చిన కంపెనీ

IT firm: ఉద్యోగులకు కార్లు గిఫ్టుగా ఇచ్చిన కంపెనీ

గుజరాత్ లో డైమండ్ వ్యాపారులు ఇళ్లు, కార్లు, వజ్రాలను ఏటా దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు పంచి పెట్టడాన్ని మనం ఇప్పటి వరకూ చూశాం. తాజాగా గుజరాత్ లోని ఓ ఐటీ కంపెనీ కూడా ఇదే స్టైల్ ఫాలో అయింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఐటీ ఫర్మ్ తమ ఉద్యోగుల పనితీరుకు మెచ్చి వారికి కార్లను బహుమతిగా ఇచ్చింది. గత కొన్నేళ్లుగా తమ సంస్థలో పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని, వారి హార్డ్ వర్క్ కు గుర్తింపుగా కార్లు ఇస్తున్నట్టు వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏషియా, యూరప్, ఆస్ట్రేలియాల్లో తమ కార్యకలాపాలు సాగుతున్నాయని, భవిష్యత్తులోనూ ఉద్యోగుల అంకిత భావానికి తగిన ప్రతిఫలం ఇచ్చి, తమ లాభాల్లో ఇలాగే వాటా ఇస్తామని కంపెనీ సీఈవో రమేష్ మరంద్ వెల్లడించారు. త్రిధ్యా టెక్ అనే కంపెనీ టెక్ సొల్యూషన్స్ ను అందించే సర్వీస్ సెక్టర్ లో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News