ముకుంద జువెలరీ డిజైన్లు, నాణ్యమైన బంగారు, వెండి ఆభరణాలకు పేరుగాంచిన సంస్థ అని బీఆర్ఎస్ ఎమ్మేల్యే కె.పి.వివేకానంద అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అంగడిపేటలో ప్రఖ్యాత ఆభరణాల సంస్థ ముకుంద జువెలరీ వారి కొత్త షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేకా, షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ముకుంద జ్యువెలరీ తన నాణ్యతా ప్రమాణాలతో వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందించి వారి మన్ననలు పొందాలని, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు కుంటా సిద్ధిరాములు, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, కాలే నాగేష్, ఎల్లా గౌడ్, బాల మల్లేష్, కాలే గణేష్, పులి మహేష్, కె. జి. విధ్యాధర్ గౌడ్, ముకుంద జువెలరీ యజమాన్యం ఎం.డి. నరసింహారెడ్డి, కృష్ణ, నికిత సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.