Saturday, November 15, 2025
Homeట్రేడింగ్Rs 60 Crs Noodles: వాళ్లు 60 కోట్ల రూపాయల నూడుల్స్ తినేశారోచ్!

Rs 60 Crs Noodles: వాళ్లు 60 కోట్ల రూపాయల నూడుల్స్ తినేశారోచ్!

యమ్ యమ్

2024లో ఏకంగా 60 కోట్ల రూపాయల నూడుల్స్ తినేశారు.  అది కూడా దేశమంతా కలిసి కాదు కేవలం ఒక్క సిటీవాళ్లే ఇన్ని నూడుల్స్ ఒక్క ఏడాదిలో తినేశారంటే షాకింగ్ గా ఉందికదా. రాజధాని ఢిల్లీ సిటీలో నూడుల్స్ కు ఉన్న డిమాండ్ ఈ రేంజ్ లో ఉందిమరి. ఇండియాలో నూడుల్స్ కు ఆల్టర్నేటివ్ లేదు, నూడుల్స్ ఆల్ టైం ఫేవరెట్ అని మరోసారి ప్రూవ్ అయ్యేలా ఈ నూడుల్స్ ఆర్డర్లు స్విగ్గీలో జరిగాయి. 

- Advertisement -

నిమిషానికి 273 చాక్లెట్స్

2024 జనవరి 1వ తేదీ నుంచి ఇదే ఏడాది డిసెంబర్ 1 వరకు జరిగిన ఈ ఆర్డర్స్ ఢిల్లీలో జరిగినట్టు స్విగ్గీ చెప్పటం విశేషం.  రక్షాబంధన్ రోజు అత్యధికంగా 2,85,000 డెలివరీలు ‘ఆర్డర్ ఫర్ అదర్స్’ కేటెగెరీలో ఈ ఇయర్ బుక్ అయినట్టు స్విగ్గీ చెబుతోంది.

ఇక నిమిషానికి 273 చాక్లెట్ల ఆర్డర్స్ కూడా కూడా ఇదే రోజు వచ్చాయని స్విగ్గీ చెబుతుంటే మనోళ్లకు చాక్లెట్లు అంటే ఎంతిష్టమో మళ్లీ చెప్పాల్సిన అవసరం లేకుండా చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad