Saturday, November 15, 2025
Homeబిజినెస్PhysicsWallah IPO: ఎడ్-టెక్ సెన్సేషన్ 'ఫిజిక్స్‌వాలా' ఐపీఓకు సిద్ధం.. రూ. 3,480 కోట్ల సమీకరణే లక్ష్యం

PhysicsWallah IPO: ఎడ్-టెక్ సెన్సేషన్ ‘ఫిజిక్స్‌వాలా’ ఐపీఓకు సిద్ధం.. రూ. 3,480 కోట్ల సమీకరణే లక్ష్యం

Alakh Pandey PhysicsWallah IPO: దేశీయ ఎడ్‌టెక్ దిగ్గజం, యూనికార్న్ సంస్థ ఫిజిక్స్‌వాలా (PhysicsWallah – PW), తన వ్యాపార విస్తరణ, వృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి భారీగా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది. రూ. 3,480 కోట్ల విలువైన తన తొలి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ను నవంబర్ 11న ప్రారంభించనుంది.

- Advertisement -

కంపెనీ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP) ప్రకారం, ఈ పబ్లిక్ ఆఫరింగ్ నవంబర్ 13న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు నవంబర్ 10న జరుగుతుంది.

ALSO READ: Flying Cars: టెస్లాకు భారీ షాక్.. ఫ్లయింగ్ కార్ల ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించిన చైనా కంపెనీ Xpeng!

నిధుల వినియోగం ఎలా?

ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్ల జారీ (Fresh Issue) తో పాటు, ప్రమోటర్లు రూ. 380 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనున్నారు. ప్రమోటర్లైన అలఖ్ పాండే మరియు ప్రతీక్ బూబ్ ఇద్దరూ చెరి రూ. 190 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తారు. ప్రస్తుతం వీరిద్దరికీ కంపెనీలో చెరి 40.31 శాతం వాటా ఉంది.

సమీకరించిన నిధులను ఫిజిక్స్‌వాలా విస్తృతంగా ఉపయోగించుకోవాలని ప్రణాళిక వేసింది. ఇందులో:

  • కొత్త ఆఫ్లైన్, హైబ్రిడ్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 460.5 కోట్లు.
  • ప్రస్తుతం ఉన్న సెంటర్ల లీజు చెల్లింపుల కోసం రూ. 548.3 కోట్లు.
  • మార్కెటింగ్ కార్యక్రమాల కోసం రూ. 710 కోట్లు.
  • సర్వర్ మరియు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై రూ. 200.1 కోట్లు.
  • సబ్సిడరీ సంస్థలైన జైలం లెర్నింగ్ (Xylem Learning), ఉత్కర్ష్ క్లాసెస్ & ఎడ్‌టెక్ లో పెట్టుబడుల కోసం కొంత భాగాన్ని వినియోగించనుంది.

ALSO READ: Prada Safety Pin: ప్రాడా సేఫ్టీ పిన్ ధర రూ. 69,000.. దానికి ఇన్సూరెన్స్ తీసుకోవాలేమో అని నెటిజన్ల చురకలు

యూట్యూబ్‌లో అగ్రస్థానం

నోయిడా కేంద్రంగా పనిచేసే ఫిజిక్స్‌వాలా, JEE, NEET, GATE, UPSC వంటి పోటీ పరీక్షల కోసం శిక్షణ అందిస్తుంది. ఆన్‌లైన్ (యూట్యూబ్, యాప్స్), టెక్-ఎనేబుల్డ్ ఆఫ్‌లైన్, హైబ్రిడ్ సెంటర్ల ద్వారా విద్యను అందిస్తోంది. జూలై 15, 2025 నాటికి దీని ప్రధాన యూట్యూబ్ ఛానెల్‌కు 13.7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

వ్యాపార లాభనష్టాల విషయానికి వస్తే, కంపెనీ తన నష్టాలను మునుపటి సంవత్సరం రూ. 1,131 కోట్ల నుండి మార్చి 2025తో ముగిసిన సంవత్సరానికి రూ. 243 కోట్లకు తగ్గించుకుంది. అదే సమయంలో ఆదాయం రూ. 1,941 కోట్ల నుంచి రూ. 2,887 కోట్లకు పెరిగింది. కోటక్ మహీంద్రా, జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ శాక్స్, యాక్సిస్ క్యాపిటల్ ఈ ఐపీఓను నిర్వహించనున్నాయి.

ALSO READ: Zoho Job Offer: గణిత నైపుణ్యాలు ఉన్నవారికి జోహోలో ఉద్యోగ అవకాశం: శ్రీధర్ వెంబు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad