Saturday, June 21, 2025
Homeబిజినెస్Ambani v/s Coca-Cola: కోకా-కోలా, పెప్సీపై అంబానీ యుద్ధం

Ambani v/s Coca-Cola: కోకా-కోలా, పెప్సీపై అంబానీ యుద్ధం

Ambani unveils mega plan: భారత శీతల పానీయాల మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) భారీ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. కోకా కోలా, పెప్సీలను ఢీకొట్టడమే లక్ష్యంగా ముకేశ్ అంబానీ కంపెనీ రాబోయే 12-15 నెలల్లో రూ. 6,000-8,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కాంపా బ్రాండ్ ఉత్పత్తి, పంపిణీని పెంచడానికి దేశవ్యాప్తంగా 10-12 కొత్త తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. దీనితో కోకా-కోలా మరియు పెప్సికో వంటి దిగ్గజాలకు గట్టి పోటీని ఇస్తుంది.

- Advertisement -

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ దేశీయ శీతల పానీయాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది. కంపెనీ తన కాంపా బ్రాండ్,  ఇతర పానీయాల ఉత్పత్తి, పంపిణీని పెంచడానికి 8 వేల కోట్ల భారీ పెట్టుబడికి సిద్ధమైంది.

దీని ద్వారా అంబానీ సంస్థ కోకా-కోలా, పెప్సికో వంటి దిగ్గజ కంపెనీలతో ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించింది. తక్కువ ధరకే స్థానికంగా శీతల పానియాలను అందించడం ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు అంబానీ ఈ యుద్ధానికి తెరలేపారు. ఈ ప్రణాళికలో భాగంగా, దేశవ్యాప్తంగా 10 నుండి 12 కొత్త తయారీ యూనిట్లను (గ్రీన్‌ఫీల్డ్ మరియు కో-ప్యాకింగ్) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా, అంబానీ కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకోవాలని భావిస్తోంది.

ఈ కంపెనీకి ఇప్పటికే 18 యూనిట్లు ఉన్నాయి మరియు ఇప్పుడు దేశంలోని ప్రతి మూలకు తన పరిధిని విస్తరించాలని చూస్తోంది. దీని కోసం, ఈశాన్య భారతదేశంలోని జెరిఖో ఫుడ్స్ అండ్ డ్రింక్స్‌తో భాగస్వామ్యంతో గౌహతిలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దీనితో పాటు, కంపెనీ బీహార్‌లో కూడా ఒక యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది.

RCPL పానీయాల శ్రేణిలో కాంపా కోలా, ఆరెంజ్, లైమ్, సోస్యో, సన్ క్రష్ జ్యూస్, ‘స్పిన్నర్’ స్పోర్ట్స్ డ్రింక్ మరియు ‘రాస్కిక్’ హైడ్రేషన్ బ్రాండ్లు ఉన్నాయి. స్పిన్నర్ శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి బ్రాండ్ను పెంచడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

రిలయన్స్ ఇక్కడ కూడా తన దూకుడు ధరల వ్యూహాన్ని అమలు చేసింది, కేవలం రూ. 10కే ‘స్పిన్నర్’ పానీయాన్ని ప్రారంభించింది. ఇది ప్రత్యర్థి బ్రాండ్ల ధరలో సగం కంటే చాలా తక్కువ.

గత ఆర్థిక సంవత్సరంలో, RCPL ఆదాయం రూ.11,500 కోట్లు కాగా, అందులో కాంపా మరియు ఇండిపెండెన్స్ బ్రాండ్లు ఒక్కొక్కటి రూ.1,000 కోట్లు అందించాయి. కాంపా తన అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ఇప్పటికే రెండంకెల మార్కెట్ వాటాను సాధించిందని కంపెనీ పేర్కొంది. మార్చి 2026 నాటికి పానీయాల విభాగంలో దేశ వాటాలో 70% చేరుకోవాలని అంబానీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News