Gold Price Today: స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం రేటు ఏకంగా 4వేల డాలర్ల మార్కును క్రాస్ చేసిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటంతో వారాంతంలో బంగారం రేట్లు రిటైల్ మార్కెట్లో దానికి అనుగుణంగా తగ్గుముఖం పట్టాయి. అయితే వెండి రేట్లు మాత్రం వేగంగా పెరుగుతూ తెలుగు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
శుక్రవాం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.186 తగ్గింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 229 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,210 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.3వేలు పెరిగి రూ.లక్షా 80 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,284, ముంబైలో రూ.12,229, దిల్లీలో రూ.12,244, కలకత్తాలో రూ.12,229, బెంగళూరులో రూ.12,229, కేరళలో రూ.12,229 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,260, ముంబైలో రూ.11,210, దిల్లీలో రూ.11,220, కలకత్తాలో రూ.11,210, బెంగళూరులో రూ.11,210, కేరళలో రూ.11,210గా ఉన్నాయి.


