Gold Price Today: ప్రస్తుతం పండుగల సందడి నడుస్తోంది. రెండు రోజుల్లో ధనత్రయోదశి ఆ తర్వాత దీపావళి వస్తున్న నేపథ్యంలో చాలా మంది గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో బంగారం రేట్లు ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా బ్రేక్ తీసుకోగా వెండి స్వల్ప తగ్గింపును చూస్తోంది. చాలా చోట్ల వెండికి పెరుగుతున్న భారీ డిమాండ్ కారణంగా వ్యాపారులు కస్టమర్ల నుంచి ఆర్డర్లు కూడా తీసుకోవటం లేదని ముంబై జవేరీ మార్కెట్లో వ్యాపారుల మాటల ప్రకారం వెల్లడైంది.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇక చైనాపై 100 శాతం సుంకాల హెచ్చరికతో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
బుధవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 889 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,815 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.వెయ్యి తగ్గి రూ.2లక్షల 6 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,938, ముంబైలో రూ.12,889, దిల్లీలో రూ.12,904, కలకత్తాలో రూ.12,889, బెంగళూరులో రూ.12,889, కేరళలో రూ.12,889 వద్ద మార్పు లేకుండా స్థిరంగానే కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,860, ముంబైలో రూ.11,815, దిల్లీలో రూ.11,830, కలకత్తాలో రూ.11,815, బెంగళూరులో రూ.11,815, కేరళలో రూ.11,815గా బ్రేక్ తీసుకుని అలాగే నిన్నటి రోట్ల వద్దనే కొనసాగుతున్నాయి.


