Gold Rate Today: దసరా నవరాత్రుల సమయంలో గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారికి ఇదే రైట్ టైమ్. రెండో రోజు కూడా బంగారం భారీగా తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సూపర్ హ్యాపీలో ఉన్నారు. ఈవారం ప్రారంభంతో భారీగా పెరిగిన ధరలు దిగిరావటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో తెలుగు ప్రజలు షాపింగ్ చేయటానికి ముందు అక్కడి రేట్లను గమనించటం ముఖ్యం..
సోమవారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.93 తగ్గింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 4447 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,490 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.లక్ష 50వేల వద్ద ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,466, ముంబైలో రూ.11,444, దిల్లీలో రూ.11,459, కలకత్తాలో రూ.11,444, బెంగళూరులో రూ.11,444, కేరళలో రూ.11,444 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,510, ముంబైలో రూ.10,490, దిల్లీలో రూ.10,505, కలకత్తాలో రూ.10,490, బెంగళూరులో రూ.10,490, కేరళలో రూ.10,490గా ఉన్నాయి.


