Saturday, November 15, 2025
Homeబిజినెస్Gold Price: శనివారం భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. లక్ష 10వేలకు దగ్గర్లో తులం..

Gold Price: శనివారం భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. లక్ష 10వేలకు దగ్గర్లో తులం..

Gold Rate Today: రిటైల్ మార్కెట్లలో కూడా బంగారం, వెండి ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రపంచ స్థాయిలో అమెరికాతో చాలా దేశాల దౌత్యపరమైన, రాజకీయ సంబంధాలకు బీటలు వారుతున్న నేపథ్యంలో బులియన్ మార్కెట్లు కూడా వాటి ప్రభావాన్ని గమనిస్తున్నాయి. ప్రధానంగా ఇన్వెస్టర్లు బాండ్స్ నుంచి ఆదాయం పెంచుకునేందుకు క్రిప్టోలకు బదులు విలువైన లోహాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తున్న వేళ రిటైల్ ర్యాలీ కొనసాగుతూనే ఉంది.

- Advertisement -

24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.88 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.10, 849 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.9,945 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి రూ.లక్ష 38వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము రూ.138 అన్నమాట. ఈ రోజు వెండి కేజీకి దాదాపు రూ.2వేల పెరుగుదలను చూసింది.

ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.10,849, ముంబైలో రూ.10,849, దిల్లీలో రూ.10,862, కలకత్తాలో రూ.10,849, బెంగళూరులో రూ.10,849, కేరళలో రూ.10,849 వద్ద కొనసాగుతున్నాయి.

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9,945, ముంబైలో రూ.9,945, దిల్లీలో రూ.9,960, కలకత్తాలో రూ.9,945, బెంగళూరులో రూ.9,945, కేరళలో రూ.9,945గా ఉన్నాయి.

బంగారం వెండి రేట్ల పెరుగుదలను ప్రేరేపిస్తున్న కారణాలు..
అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు వార్తలతో పాటు సెంట్రల్ బ్యాంకుల షాపింగ్, ఇన్వెస్టర్ల స్టాకింగ్, గ్లోబల్ జియో పొలిటికల్ ఆందోళనలు ర్యాలీకి కీలకగా మారాయి. ఈ క్రమంలో చాలా మంది రిటైలర్లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బెట్టింగ్ వేస్తున్నారు. అయితే నిపుణులు మాత్రం కొంత అప్రమత్తత అవసరం అని అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad