Gold Price Today: శుక్రవారం భారీగానే తగ్గిన గోల్డ్ రేట్లు మళ్లీ శనివారం రోజున పుంజుకున్నాయి. దీంతో వారాంతంలో షాపింగ్ చేయాలనుకుంటున్న వారు స్పీడు పెంచుతున్నారు. ఆలస్యం చేస్తే రేట్లు మళ్లీ పెరుగుతాయనే భయంతో దీపావళి షాపర్లు తిరిగి షాపింగ్ మెుదలుపెట్టేస్తున్నారు. అయితే తెలుగు ప్రజలు దేశంలోని వివిధ నగరాల్లో రేట్లను పరిశీలించటం కొనుగోలుకు ముందు ముఖ్యం.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇక చైనాపై 100 శాతం సుంకాల హెచ్చరికతో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
శనివారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.55 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 426 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,390 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.3వేలు పెరిగి రూ.లక్షా 87 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,464, ముంబైలో రూ.12,426, దిల్లీలో రూ.12,441, కలకత్తాలో రూ.12,426, బెంగళూరులో రూ.12,426, కేరళలో రూ.12,426 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,425, ముంబైలో రూ.11,390, దిల్లీలో రూ.11,405, కలకత్తాలో రూ.11,390, బెంగళూరులో రూ.11,390, కేరళలో రూ.11,390గా ఉన్నాయి.


