Gold Rate Today: దసరా నవరాత్రుల సమయంలో గోల్డ్ షాపింగ్ చేయాలనుకునే వారికి మంచి సమయం వచ్చేసింది. కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్న గోల్డ్ రేట్లు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తగ్గిన రేట్లతో షాపింగ్ చేయాలనుకుంటున్నారు. అయితే ముందుగా తమ నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలి.
సోమవారం 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.32 తగ్గింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 537 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,575 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.లక్ష 50వేల వద్ద కొనసాగుతోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్లి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,564, ముంబైలో రూ.11,537, దిల్లీలో రూ.11,552, కలకత్తాలో రూ.11,537, బెంగళూరులో రూ.11,537, కేరళలో రూ.11,537 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,600, ముంబైలో రూ.10,575, దిల్లీలో రూ.10,590, కలకత్తాలో రూ.10,575, బెంగళూరులో రూ.10,575, కేరళలో రూ.10,575గా ఉన్నాయి.


