Gold Price Today: ప్రస్తుతం స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం రేటు దాదాపు 4వేల డాలర్ల మార్కును చేరుకుంది. చాలా కాలంగా నిపుణులు హెచ్చరిస్తున్న ఈ స్థాయిలకు గోల్డ్ అత్యంత వేగంగా రావటం దాని ర్యాలీని సూచిస్తోంది. ప్రధానంగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ తర్వాత ఫ్రెంచ్ దేశంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితులు బంగారం రేట్లకు రెక్కలు తెస్తున్నాయి. దీనికి తోడు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై పెరుగుతున్న ఊహాగానాలతో లక్షల మంది ఇన్వెస్టర్లు ఆందోళలతో బంగారం, వెండి వెనుక పడటం రేట్లను మరింతగా పెంచేస్తోంది.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
మంగళవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.125 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 202 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,185 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.1000 పెరిగి రూ.లక్షా 67వేల వద్దకు చేరుకుని చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,218, ముంబైలో రూ.12,202, దిల్లీలో రూ.12,207, కలకత్తాలో రూ.12,202, బెంగళూరులో రూ.12,202, కేరళలో రూ.12,202 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,200, ముంబైలో రూ.11,185, దిల్లీలో రూ.11,200, కలకత్తాలో రూ.11,185, బెంగళూరులో రూ.11,185, కేరళలో రూ.11,185గా ఉన్నాయి.


