Gold Rate Today: దసరా పండుగ రోజున బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. గడచిన కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. పండగ రోజున గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గటంతో తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలుదారులు షాపులకు క్యూ కడుతున్నారు. చాలా మంది భవిష్యత్తులో తగ్గుతాయనే పిచ్చి ఆలోచనను పక్కనపెట్టి రేటు తగ్గగానే షాపింగ్ షురూ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ముఖ్య నగరాల్లో రేట్లు తెలుకుని షాపింగ్ చేయండి.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
గురువారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.55 తగ్గింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.11, 869 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.10,880 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.2000 పెరిగి రూ.లక్షా 63వేల వద్దకు చేరుకుని చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.11,869, ముంబైలో రూ.11,869, దిల్లీలో రూ.11,884, కలకత్తాలో రూ.11,869, బెంగళూరులో రూ.11,869, కేరళలో రూ.11,869 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10,880, ముంబైలో రూ.10,880, దిల్లీలో రూ.10,895, కలకత్తాలో రూ.10,880, బెంగళూరులో రూ.10,880, కేరళలో రూ.10,880గా ఉన్నాయి.


