Gold Price Today: దీపావళి తర్వాత వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం రేట్లకు బ్రేక్ పడింది. వారాంతంలో మళ్లీ విలువైన లోహాల ధరలు క్రమంగా పెరగటంతో కొనుగోలుదారుల్లో ఆందోళనలు స్టార్ట్ అయ్యాయి. అయితే గోల్డ్ సిల్వర్ ఆభరణాలు, కాయిన్స్ కొనాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా రేట్లను పరిశీలించాలి.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. కానీ నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. దీనికితోడు ట్రంప్ రష్యా చమురు కంపెనీలపై మరింత కఠిన ఆంక్షలు ప్రకటించటం ప్రస్తుతం రేట్ల పెరుగుదలను ప్రేరేపిస్తోంది.
శనివారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 546 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,500 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.3వేలు తగ్గి రూ.లక్ష 71 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,589, ముంబైలో రూ.12,546, దిల్లీలో రూ.12,561, కలకత్తాలో రూ.12,546, బెంగళూరులో రూ.12,546, కేరళలో రూ.12,546 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,540, ముంబైలో రూ.11,500, దిల్లీలో రూ.12,515, కలకత్తాలో రూ.11,500, బెంగళూరులో రూ.11,500, కేరళలో రూ.11,500గా ఉన్నాయి.


