Hyundai car prices to increase: ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హ్యుందాయ్ కారు ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అన్ని వేరియంట్ల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. వేరియంట్ను బట్టి రూ. 12,800 వరకు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని, కస్టమర్లు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. కమొడిటీ, ముడిసరకుల ధరలు పెరగడంతో కార్యకలాపాల వ్యయం భారంగా మారిందని, దీంతో కార్ల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పాడిందని వివరించింది. అయితే, కారు వేరియంట్లు, మోడళ్ల ఆధారంగా ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. వినియోగదారులపై భారం మోపాలనే ఉద్దేశం సంస్థకు లేదని, మార్కెట్ ధరల ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. కాగా, రెండ్రోజుల క్రితం దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి సైతం తమ అన్ని వేరియంట్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, అదే బాటలో హ్యుందాయ్ కూడా ధరల పెంపును ప్రకటించింది.
Also read: Karnataka CM Change: ఢిల్లీలో చక్రం తిప్పిన డీకే.. సిద్ధూకి చెక్?.. 30నే సీఎంగా ప్రమాణస్వీకారం?

