July New Rules: ప్రతి నెల ప్రభుత్వం, బ్యాంకులు, ఇతర సంస్థలు తీసుకునే నిర్ణయాలతో కొన్ని మార్పులు అమల్లోకి వస్తాయి. ఈ విధంగానే జులై 1 నుంచి కూడా కొన్ని రూల్స్ మారుతున్నాయి. ఈ మార్పులు మీ డిజిటల్ లావాదేవీలు, ఖర్చులు, ప్రభుత్వ ఐడి లింకింగ్ మొదలైన వాటిని నేరుగా ప్రభావితం చేస్తాయి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసిన ముఖ్యమైన మార్పులు ఇక్కడ ఉన్నాయి.
తత్కాల్ రైల్వే టికెట్ బుకింగ్ కోసం OTP తప్పనిసరి
ఇక నుండి ఐఆర్సిటిసి (IRCTC) వెబ్సైట్ లేదా యాప్ ద్వారా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేందుకు OTP ధృవీకరణ తప్పనిసరి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో అందుకున్న ఒటిపిని నమోదు చేసిన తర్వాత టికెట్ ధృవీకరించబడుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా, తప్పుడు బుకింగ్లను అరికట్టడానికి ఈ చర్య తీసుకున్నారు.
క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై కొత్త మార్గదర్శకాలు
హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా కొత్త నిర్ణయాలను జులైలో అమలు చేస్తోంది. బ్యాంక్ కొన్ని కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టింది.
గేమింగ్ యాప్లలో రూ.10,000 కంటే ఎక్కువ ఖర్చు చేయడంపై 1శాతం అదనపు ఛార్జ్
Paytm, Mobikwik వంటి వాలెట్లలో రూ.10,000 కంటే ఎక్కువ లోడ్ చేయడంపై 1% రుసుము
వినియోగదారుడు రూ.50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లు చెల్లింపులు చేసినట్లయితే అదనపు ఛార్జీలు ఉంటాయి.
రూ.15,000 కంటే ఎక్కువ ఇంధన లావాదేవీలపై అదనపు ఛార్జీలు చెల్లించాలి
ఈ మార్పుల గురించి మీకు తెలియకపోతే, అవి మీ ఖర్చుపై అనూహ్య ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి, పెద్ద మొత్తాలతో లావాదేవీలు చేసే ముందు ఈ కొత్త నియమాలను గుర్తుంచుకోండి.
ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ కార్డ్ని ఉపయోగించి ఇతర బ్యాంకుల ATMల నుండి నగదును ఉపసంహరించుకోవడానికి చార్జ్ చేస్తోంది. మూడోసారి విత్ డ్రా తర్వాత ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.23 విధిస్తుంది. ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ.8.50 వసూలు చేయబడుతుంది. ఈ మార్పుతో మీరు ఇతర బ్యాంకుల ATMల వినియోగాన్ని తగ్గించడం లేదా హోమ్ బ్యాంక్ ATMలపై ఆధారపడటం మంచిది.
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు BBPS ద్వారా మాత్రమే
అన్ని క్రెడిట్ కార్డ్ బిల్లులను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారా చెల్లించడం తప్పనిసరి చేశారు. ప్రస్తుతం, BBPSలో 8 బ్యాంకులు మాత్రమే నేరుగా అందుబాటులో ఉన్నాయి. ఈ మార్పు CRED, PhonePe, BillDesk వంటి ప్లాట్ఫారమ్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్లాట్ఫారమ్ను ఉపయోగిస్తున్నారో తనిఖీ చేసుకోండి.
పాన్–ఆధార్ లింక్ చేయడంపై కఠినమైన నియమాలు
ఇప్పుడు, కొత్త పాన్ కార్డ్ అవసరం మరియు ఆధార్ తప్పనిసరి అయింది. అలాగే ఇప్పటికే పాన్ కార్డ్ ఉన్నవారు అయితే 2025 డిసెంబర్ 31 నాటికి దానిని ఆధార్తో అనుసంధానం చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. లింక్ చేయకపోతే పాన్ చెల్లనిదిగా పరిగణించబడుతుంది. లేదా జరిమానా విధించబడవచ్చు. కాబట్టి, ఈ గడువుకు ముందు పాన్-ఆధార్ లింక్ను పూర్తి చేయడం చాలా ముఖ్యం.