Saturday, November 15, 2025
Homeబిజినెస్Microsoft Exits Pakistan: పాకిస్తాన్‌కు గుడ్‌బై చెప్పిన మైక్రోసాఫ్ట్

Microsoft Exits Pakistan: పాకిస్తాన్‌కు గుడ్‌బై చెప్పిన మైక్రోసాఫ్ట్

Microsoft Pakistan: పాకిస్తాన్ కు మైక్రోసాఫ్ట్ షాకిచ్చింది. మైక్రోసాఫ్ట్ 25 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక దేశంలోని తన కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోతలతో కూడిన పునర్వ్యవస్థీకరణ కార్యక్రమం భాగంగా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ప్రత్యక్షంగా పని చేయదు. ప్రాంతీయ కేంద్రాల ద్వారా సేవలు అందించనుంది.

- Advertisement -

కస్టమర్లకు సేవలపై ప్రభావం ఉండదు
టెక్కు క్రంచ్ కు ఇచ్చిన ప్రకటనలో మైక్రోసాఫ్ట్ “ఈ మోడల్‌ను ఇప్పటికే అనేక దేశాల్లో ఉపయోగిస్తున్నాం. పాకిస్తాన్‌లో కూడా అదే విధంగా కొనసాగుతాం” అని తెలిపింది. కస్టమర్ ఒప్పందాలు, సపోర్ట్ నాణ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని హామీ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయం స్థానికంగా కేవలం 5 మంది ఉద్యోగులను మాత్రమే ప్రభావితం చేసినా, టెక్ పరిశ్రమలో మాత్రం ఇది పెద్ద సంకేతంగా పరిగణించబడుతోంది.

ఎంటర్‌ప్రైజ్ సేల్స్‌కే పరిమితం
పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ప్రధానంగా ఎంటర్‌ప్రైజ్ సేల్స్‌పై మాత్రమే దృష్టి పెట్టింది. అజుర్, ఆఫీస్, సేవల వరకే పరిమితమైంది. భారతదేశంలో ఉన్నట్టుగా ఎప్పుడూ డెవలప్‌మెంట్ లేదా ఇంజినీరింగ్ బేస్ అక్కడ ఏర్పాటు చేయలేదు. ఇది సంస్థకు అక్కడ గాడిలో పడే అవకాశాన్ని తగ్గించింది.

గ్లోబల్ ఉద్యోగ కోతల ప్రభావం
ఇటీవల మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 9,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. అదే సమయంలో పాకిస్తాన్ కార్యాలయం మూసివేయడం గమనార్హం. పాకిస్తాన్ సమాచార శాఖ ప్రకారం, ఇది అంతర్జాతీయ పునర్వ్యవస్థీకరణలో భాగమే. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ ఐర్లాండ్‌లోని యూరోపియన్ కేంద్రానికి కీలక బాధ్యతలు బదలాయించడం వెనకబడిన సంకేతమే.

రాజకీయ అస్థిరత కారణమా?
మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ మాజీ హెడ్ జవ్వాద్ రెహ్మాన్, ఈ నిర్ణయం ప్రభుత్వానికి హెచ్చరికగా మారాలని పేర్కొన్నారు. “గ్లోబల్ కంపెనీలు ఉండేందుకు ఇబ్బంది పడుతున్నాయంటే, ప్రభుత్వానికి మరింత ప్రణాళికా దృష్టి అవసరం” అని LinkedInలో వ్యాఖ్యానించారు. మాజీ రాష్ట్రపతి అరిఫ్ అల్వీ కూడా స్పందిస్తూ, మైక్రోసాఫ్ట్ ముందుగా వియత్నాం వైపు మొగ్గుచూపిందని, పాకిస్తాన్ రాజకీయ స్థిరత కోల్పోవడమే కారణమని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ప్రభుత్వం 5 లక్షల మంది యువతకు గ్లోబల్ ఐటీ సర్టిఫికేషన్ ఇవ్వాలని ప్రకటన చేసింది. అయితే అదే సంస్థ దేశం నుంచి వెనకడుగు వేయడం, ఆ ప్రకటనల నమ్మకాన్ని తొలగించింది.

గూగుల్ ముందంజ
గూగుల్ పాకిస్తాన్‌లో Chromebook మానిఫ్యాక్చరింగ్ వంటి ప్రాజెక్టులను పరిశీలిస్తుండగా, మైక్రోసాఫ్ట్ మాత్రం అక్కడి మార్కెట్‌పై ఆసక్తి కోల్పోయినట్టు కనిపిస్తోంది. ఇది పాకిస్తాన్ ఐటీ రంగంలో ఉన్న అస్థిరత, అప్రమత్తత లేకపోవడాన్ని వెల్లడించేస్తోంది.

పాకిస్తాన్‌కు మేలుకోలుపు
ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక అనే చెప్పాలి. దేశం డిజిటల్ మార్పు వైపు దృష్టి పెట్టినప్పటికీ, అంతర్జాతీయ కంపెనీలకు అనుకూలంగా ఉండే స్థిరత, పాలసీ స్పష్టత లేకపోవడం తేలిపోయింది. గ్లోబల్ టెక్ ప్లేయర్లను ఆకర్షించాలంటే, పెట్టుబడి అనుకూల ప్రాతిపదికలు, పాలసీలు, మార్కెట్‌కు వ్యూహాత్మక దృష్టి అవసరమవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad