Sunday, February 8, 2026
Homeబిజినెస్MSMEలకు డిజిటల్ వరం..రూ. 52,300 కోట్ల రుణాలతో సరికొత్త రికార్డు

MSMEలకు డిజిటల్ వరం..రూ. 52,300 కోట్ల రుణాలతో సరికొత్త రికార్డు

PSBs Sanction : భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) దశ మారుతోంది. ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగడం, భారీగా కాగితపు పత్రాలు సమర్పించడం వంటి సవాళ్లతో సతమతమైన చిన్న వ్యాపారులకు ఇప్పుడు డిజిటల్ అండర్ రైటింగ్ ఒక సంజీవనిలా మారింది. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే (ఏప్రిల్ 1 – డిసెంబర్ 31, 2025) ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏకంగా 3.96 లక్షల రుణ దరఖాస్తులను ఆమోదించి, రూ. 52,300 కోట్లకు పైగా నిధులను మంజూరు చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం.

- Advertisement -

ఏమిటీ క్రెడిట్ అసెస్‌మెంట్ మోడల్
ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, బ్యాంకింగ్ రంగంలో ఒక విప్లవం. ఇది వ్యాపారి డిజిటల్ పాదముద్రల ఆధారంగా పనిచేస్తుంది. వ్యాపార లావాదేవీల పారదర్శకతను తక్షణమే విశ్లేషిస్తుంది. బ్యాంక్ స్టేట్‌మెంట్లను సెకన్లలో స్కాన్ చేసి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. KYC, క్రెడిట్ హిస్టరీ , మోసాల తనిఖీలను ఆటోమేటెడ్ పద్ధతిలో పూర్తి చేస్తుంది.

చిన్న వ్యాపారులకు కలిగే ప్రధాన ప్రయోజనాలు:బ్యాంకు శాఖల చుట్టూ తిరిగే పని లేదు, ఎక్కడి నుండైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో వారాల తరబడి పట్టే ప్రాసెసింగ్ సమయం ఇప్పుడు భారీగా తగ్గింది. మనిషి ప్రమేయం లేకుండా డేటా ఆధారంగా ఆబ్జెక్టివ్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. డిజిటల్ ధృవీకరణ వల్ల డాక్యుమెంటేషన్ భారం దాదాపు మాయమైపోయింది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రవేశపెట్టిన ఈ మోడల్-ఆధారిత అంచనా విధానం కొత్త వ్యాపారులకు ఇప్పటికే ఉన్న ఖాతాదారులకు సమాన అవకాశాలను కల్పిస్తోంది. డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా, MSMEలు ఆర్థిక స్వాలంబన సాధించడంలో ఈ డేటా ఆధారిత బ్యాంకింగ్ వ్యవస్థ ఒక బలమైన పునాదిగా నిలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News