Gold Price Today: నేడు ధనత్రయోదశి. భారతీయ ప్రజలు బంగారం, వెండి వంటి వస్తువులను కొనుగోలు చేయటానికి శుభసమయంగా భావించే రోజు. నిన్నటి వరకు నిరంతరం పెరుగుతూ ఊపిరి సలపనివ్వని గోల్డ్, వెండి రేట్లు నేడు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో రిటైల్ పెట్టుబడిదారులు ఆలస్యం చేయకుండా షాపింగ్ చేయటానికి ఉర్రూతలూగుతున్నారు. అయితే ముందుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ రేట్లను గమనించటం ముఖ్యం…
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. కానీ నెమ్మదిగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.
శనివారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.13, 086 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,995 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.17వేలు తగ్గి రూ.లక్ష 90 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.13,037, ముంబైలో రూ.13,086, దిల్లీలో రూ.13,101, కలకత్తాలో రూ.13,086, బెంగళూరులో రూ.13,086, కేరళలో రూ.13,086 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,950, ముంబైలో రూ.11,995, దిల్లీలో రూ.12,010, కలకత్తాలో రూ.11,995, బెంగళూరులో రూ.11,995, కేరళలో రూ.11,995గా ఉన్నాయి


