Tuesday, June 24, 2025
Homeబిజినెస్petrol Updates: పెట్రోల్ లీటరు రూ.120కి చేరుకోవచ్చు

petrol Updates: పెట్రోల్ లీటరు రూ.120కి చేరుకోవచ్చు

petrol rate jump: హార్ముజ్ జలమార్గం మూసివేత కారణంగా సామాన్యుడిపై పెట్రో భారం మొదలు కానుంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 80 వద్ద ట్రేడ్ అవుతోంది, కొద్ది రోజుల్లో ఇది 120-150 డాలర్ల వరకు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశంపై కూడా ప్రభావం చూపుతుంది. అమెరికా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా హార్ముజ్ జలమార్గాన్ని మూసివేయాలనే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ ఇటీవల ఆమోదించింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తే, అది భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే ఇది చమురు వాణిజ్యానికి ముఖ్యమైన మార్గం, దీని ద్వారానే చాలా వరకు ప్రపంచ దేశాలకు చమురు రావాణా జరుగుతోంది.

- Advertisement -

ఈ వార్త వెలువడిన తర్వాత ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్లకి పెరిగింది. భారతదేశం తన చమురు అవసరాలలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ధర చాలా కాలంగా ఎక్కువగా ఉంటే, చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరను పెంచాల్సి రావచ్చు.

హార్ముజ్ జలసంధి ఇరుకైన సముద్ర మార్గం, ఇది పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రానికి కలుపుతుంది. ఇది కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే, కానీ ప్రపంచంలోని ముడి చమురులో 20-25 శాతం, సహజ వాయువులో 25 శాతం ఈ మార్గం గుండా వెళుతుంది.

సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్ వంటి దేశాల నుండి చమురు ట్యాంకర్లు ప్రపంచవ్యాప్తంగా ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. ఈ మార్గం భారతదేశానికి ప్రత్యేకమైనది ఎందుకంటే మన చమురులో 40% కంటే ఎక్కువ ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఇది మూసివేస్తే చమురు సరఫరాకు అంతరాయం కలగవచ్చు.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జూన్ 22న, ఇరాన్ మూడు అణు స్థావరాలు – నటాంజ్, ఫోర్డూ, ఇస్ఫహాన్ పై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఈ కారణంగానే ఆగ్రహించిన ఇరాన్ పార్లమెంట్ హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

హర్ముజ్ జలమార్గం మూసివేతతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ముడి చమురు ధర 30-50% పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు దాదాపు $80 ఉంది, కానీ అది $120-150 వరకు పెరగవచ్చు. ఇది భారతదేశంలో పెట్రో ధరల పెంపునకు కారణం కావొచ్చు.

చమురు ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చు. పెట్రోల్ లీటరుకు రూ.120 లేదా అంతకంటే ఎక్కువ కావొచ్చని భావిస్తున్నారు.

దీని కారణంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముంది. పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఖర్చు పెరుగుతుంది, దీని కారణంగా ఆహార పదార్థాలు, మందులు మరియు ఇతర ముఖ్యమైన వస్తువులు కూడా ఖరీదైనవి అవుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News