Suzuki e-Access Launched: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఎట్టకేలకు భారతదేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-యాక్సెస్ను విడుదల చేసింది. కంపెనీ ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.188,490గా నిర్ణయించింది. ఇప్పటికే, ఈ స్కూటర్ కోసం బుకింగ్లు ప్రారంభమయ్యాయి. కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి డీలర్షిప్లలో దీన్ని బుక్ చేసుకోవచ్చు. ఆసక్తికరంగా ఈ సుజుకి ఇ-యాక్సెస్ను ఫ్లిప్కార్ట్ ద్వారా ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ ఒకే ఛార్జ్తో 95 కిలోమీటర్ల పరిధిని, 71 కిమీ/గం గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.
బ్యాటరీ, పరిధి, ఛార్జింగ్ వివరాలు
సుజుకి ఇ-యాక్సెస్ 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో శక్తినిస్తుంది. ఈ బ్యాటరీ 95 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. కంపెనీ ప్రకారం..ప్రామాణిక ఛార్జర్తో ఇంట్లో ఛార్జ్ చేయడానికి 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. అయితే, ఫాస్ట్ ఛార్జర్ని ఉపయోగించి స్కూటర్ను కేవలం 2 గంటల 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. బ్యాటరీలో కేవలం 10% ఛార్జ్ మిగిలి ఉన్నప్పటికీ ఈ స్కూటర్ పనితీరు, వేగం మారదని సుజుకి తెలిపింది.
also read:Dates Benefits: ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే ఏమవుతుంది..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
పవర్, రైడింగ్ మోడ్లు
ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ 5.49 bhp శక్తిని, 15 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన రైడింగ్ అనుభవం కోసం ఇది మూడు రైడింగ్ మోడ్లను అందిస్తుంది. ఇందులో ఇకో (Eco), రైడ్ A, రైడ్ B వంటి మోడ్స్తో పాటు రివర్స్ మోడ్ కూడా ఉంది.
కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్లు
సుజుకి ఇ-యాక్సెస్తో కంపెనీ అనేక ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇందులో అదనపు ఖర్చు లేకుండా 7 సంవత్సరాల లేదా 80,000 కి.మీ వారంటీ ఉంటుంది. మూడేళ్ల తర్వాత స్కూటర్ను తిరిగి విక్రయిస్తే వాహనదారులు దాని విలువలో 60% వరకు తిరిగి ఇచ్చే బై-బ్యాక్ అష్యూరెన్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. సుజుకి ప్రస్తుత కస్టమర్లకు రూ.10,000 వరకు, కొత్త కస్టమర్లకు రూ.7,000 వరకు బోనస్ను అందిస్తోంది. అదనంగా, కేవలం 5.99% నుండి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లకు ఫైనాన్స్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

