Gold Price Today: గడచిన రెండు వారాలుగా బంగారం, వెండి బ్రేకులు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. గ్లోబల్ పరిణామాలతో పాటు మారుతున్న సెంట్రల్ బ్యాంకుల వ్యూహాలతో ఈ విలువైన లోహాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. మధ్యతరగతి భారతీయులు ఇకపై గిల్టు నగలు, వన్ గ్రామ్ గోల్డ్ లాంటి ప్రత్యామ్నాయాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయటానికి ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లను పరిశీలించటం ముఖ్యం..
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విదేశీ సినిమాలపై కూడా ట్రంప్ 100 శాతం సుంకాలతో విరుచుకుపడటంతో రానున్న కాలంలో మరిన్ని రంగాలపై ట్రంప్ టారిఫ్స్ ఉండొచ్చనే ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. మరో పక్క వెండి సరఫరా తగ్గుదల కూడా దీని రేట్ల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఇక చైనాపై 100 శాతం సుంకాల హెచ్చరికతో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
మంగళవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు నిన్నటి కంటే రేటు రూ.328 పెరిగింది. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.12, 868 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,795 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.4వేలు పెరిగి రూ.2లక్షల 6 వేల వద్ద చెమటలు పట్టిస్తోంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.12,900, ముంబైలో రూ.12,868, దిల్లీలో రూ.12,883, కలకత్తాలో రూ.12,868, బెంగళూరులో రూ.12,868, కేరళలో రూ.12,868 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.11,825, ముంబైలో రూ.11,795, దిల్లీలో రూ.11,810, కలకత్తాలో రూ.11,795, బెంగళూరులో రూ.11,795, కేరళలో రూ.11,795గా ఉన్నాయి.


