Toyota Hilux 2025: టయోటా ఇండియాలో అనేక విభాగాలలో వాహనాలను విక్రయిస్తోంది. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొత్త టయోటా హిలక్స్ 2025 ను ప్రవేశపెట్టింది. ఈ పికప్ ట్రక్ ప్రత్యేక ఫీచర్ ఏంటంటే? ఇది మొదటిసారిగా ICEకి బదులుగా ఎలక్ట్రిక్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ టెక్నాలజీని కలిగి ఉంది. కంపెనీ దీని బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్ఫామ్పై తయారు చేసింది. ఈ ట్రక్ అద్భుతమైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలను, బ్రేక్ , టార్క్ ను ఆటోమేటిక్ గా సర్ ఫేస్ కు సర్దుబాటు చేసే మల్టీ టెర్రైన్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఇప్పుడు కొత్త టయోటా హిలక్స్ 2025 బ్యాటరీ-మోటర్, ఫీచర్లు, ఇంజిన్ వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
బ్యాటరీ, మోటారు ఎంత శక్తివంతమైనది?
తయారీదారు కొత్త టయోటా హిలక్స్ కు 59.2 kWh బ్యాటరీని అమర్చారు. ఇది దాదాపు 240 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ మోటారు గరిష్టంగా 268 న్యూటన్ మీటర్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ట్రక్ గరిష్టంగా 715 కిలోగ్రాముల బరువును లాగగలదు. 1600 కిలోగ్రాముల టోయింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇంజిన్ ఎంత శక్తివంతమైనది?
తయారీదారు దాని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్లో 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించారు. ఇది 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్తో శక్తినిస్తుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
టయోటా హిలక్స్ 2025కి 12.3-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లైండ్-స్పాట్ మానిటర్, డ్రైవింగ్ మానిటరింగ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జర్, డార్క్ ఇంటీరియర్, LED లైట్లు వంటి ఫీచర్లకు అందించారు.
ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
కంపెనీ కొత్త టయోటా హిలక్స్ ను ఆవిష్కరించినప్పటికీ, డిసెంబర్ 2025లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దీనిని ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో రిలీజ్ చేస్తారు. ఇక భారతదేశంలో లాంచ్ విషయానికి వస్తే కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.


