AP DSC Exams Postponed: ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ(DSC) కింద 16వేలకు పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన విషయం విధితమే. తాజాగా ప్రభుత్వం డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు ప్రకటించింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వైజాగ్ లో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సుమారు ఐదు లక్షల మందితో యోగాసనాలు వేయించి గిన్నిస్ రికార్డులో చోటు సంపాందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ అధికారులు మొత్తం ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లలో బిజీగా ఉంటారు.
ఇలాంటి తరుణంలో పరీక్షలు నిర్వహిస్తే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారనే కారణంతో పరీక్షలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షలను జులై 1,2వ తేదీల్లో నిర్వహిస్తామని డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు వాయిదాపడిన దృష్ట్యా అభ్యర్థులు సిద్ధంకావాలని సూచించారు.
ఇక వాయిదా పడిన పరీక్షలకు సంబంధించిన అభ్యర్థులు సవరించిన హాల్టికెట్లను జూన్ 25 నుంచి అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in లో అందుబాటులో ఉండున్నారు. ఈ హాల్టికెట్లలో కొత్త పరీక్షా కేంద్రాలు, పరీక్షలు మార్చిన తేదీల వివరాలు ఉంటాయి. అభ్యర్థులు కొత్త హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకుని.. కొత్త తేదీల్లోనే పరీక్షలకు హాజరు కావాలని కృష్ణారెడ్డి సూచించారు. అభ్యర్థుల సౌకర్యం కోసమే వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
AP DSC: ఏపీ డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES