విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు(AP EAPCET Results) విడుదలయ్యాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ స్ట్రీమ్ కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి జేఎన్టీయూ కాకినాడ వీసీ ఆచార్య CSRK ప్రసాద్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 75.67 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలను ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో కాకినాడ జేఎన్టీయూ(JNTUK) నిర్వహించింది. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,429 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,40,300 మంది హాజరయ్యారు. వీరిలో 2,57,509 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలు నిర్వహించిన 12 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేయడం విశేషం. కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నారు.
AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల
సంబంధిత వార్తలు | RELATED ARTICLES