Friday, March 13, 2026
Homeకెరీర్GDS Recruitment : పదవ తరగతితో ‘పోస్టల్’ కొలువు.. పరీక్ష లేకుండానే ‘భరోసా’ ఇచ్చే ఉద్యోగం!

GDS Recruitment : పదవ తరగతితో ‘పోస్టల్’ కొలువు.. పరీక్ష లేకుండానే ‘భరోసా’ ఇచ్చే ఉద్యోగం!

Indian Post GDS Recruitment 2026 : చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న గ్రామీణ యువతకు భారతీయ తపాలా శాఖ ‘తీపి కబురు’ అందించింది. ఎటువంటి కఠినమైన రాత పరీక్షలు, గంటల తరబడి ఇంటర్వ్యూల అవసరం లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అద్భుత అవకాశం ఇప్పుడు మీ ముంగిట ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న వేలాది పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నగారా మోగింది. కేవలం పదవ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే ఈ నియామకాలు జరగనుండటం విశేషం. మరి ఈ ఉద్యోగాలకు ఉండాల్సిన కనీస అర్హతలేంటి? తెలుగు రాష్ట్రాల్లో ఏయే జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? దరఖాస్తు ప్రక్రియలో పొరపాట్లు జరగకుండా ఎలా జాగ్రత్తపడాలి? ఈ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే..

- Advertisement -

పరీక్ష లేదు.. పైసా ఖర్చు లేదు: మెరిట్ ఉంటే కొలువు మీదే : ఈ నోటిఫికేషన్ ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, నియామక ప్రక్రియలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు తమ పదవ తరగతి (SSC)లో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 14, 2026ని తుది గడువుగా నిర్ణయించారు. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఎడిట్ ఆప్షన్ కల్పించనున్నారు.

పనివేళలు & జీతం: ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు రోజుకు కేవలం 4 నుంచి 5 గంటలు పని చేస్తే సరిపోతుంది. పోస్టును బట్టి ప్రారంభ వేతనం రూ. 10,000 నుంచి రూ. 12,000 వరకు ఉంటుంది, ఇది వివిధ అలవెన్సులతో కలిపి రూ. 29,380 వరకు పెరిగే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు వరం: తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల జాతర : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని దాదాపు అన్ని డివిజన్లలో భారీగా ఖాళీలు ఉన్నాయి.

తెలంగాణ సర్కిల్: ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 98 పోస్టులు ఉండగా, నిజామాబాద్ (50), ఆదిలాబాద్ (54), సికింద్రాబాద్ (54), వనపర్తి (44) వంటి జిల్లాల్లోనూ అధిక ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ సర్కిల్: ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 70 పోస్టులు ఉన్నాయి. నెల్లూరు (50), అనకాపల్లి (48), నరసరావుపేట (48), చిత్తూరు (46), తిరుపతి (53) డివిజన్లలో అభ్యర్థులకు మంచి అవకాశం ఉంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి? నిపుణుల సూచనలు : దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే సాగుతుంది. తపాలా శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాష (తెలుగు)పై పట్టు ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
పత్రాల తయారీ: దరఖాస్తు చేసే సమయంలో పదో తరగతి మెమో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం వంటివి స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి.




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News