Jahnavi Junior College: జాహ్నవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో విశిష్ట ప్రతిభ కనబరిచారు. నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జాహ్నవి కళాశాల విద్యార్థులు పూర్తి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ ఏ. పరమేశ్వర్, వైస్ఛైర్మన్ ఎ. లక్ష్మి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. ఈ విజయానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం ముఖ్య కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కళాశాల యాజమాన్యం వెల్లడించింది. ప్రతి విద్యార్థి విజయమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.

