Saturday, November 15, 2025
Homeకెరీర్PNB Bank Jobs 2025: నిరుద్యోగులకు శుభవార్త.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే...

PNB Bank Jobs 2025: నిరుద్యోగులకు శుభవార్త.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.85 వేల వేతనం

Punjab National Bank LBO Recruitment 2025 Notification: ప్రభుత్వ రంగం ఆధీనంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) దేశ వ్యాప్తంగా ఉన్నపలు బ్రాంచుల్లోని వివిధ శాఖల్లో లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 750 లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్ (ఎల్‌బీఓ) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా నవంబర్‌ 23లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు www.pnb.bank.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/devotional-news/super-moon-on-karthika-pounami/

రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లో 5, గుజరాత్‌లో 95, కర్ణాటకలో 85, మహారాష్ట్రలో 135, తెలంగాణలో 88, తమిళనాడులో 85, పశ్చిమ బెంగాల్‌లో 90, జమ్మూ &కాశ్మీర్‌లో 20, లద్దాఖ్‌లో 03, అరుణాచల్ ప్రదేశ్‌లో 5, అస్సాంలో 86, మణిపుర్‌లో 8, మేఘాలయలో 8, మిజోరంలో 5, నాగాలాండ్‌లో 5, సిక్కింలో 5, త్రిపురలో 22 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి. కనీసం ఏడాది బ్యాంకింగ్‌ రంగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు తెలుగులో ప్రావీణ్యం ఉండాలి. ఇక, వయోపరిమితి విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు రూ.1180, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.59 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా ఫైనల్ సెలెక్షన్‌ ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్షడిసెంబర్‌ 2025 లేదా జనవరి 2026లో నిర్వహించనుంది. ఎంపికైన అభ్యర్థులు ప్రతినెలా రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతభత్యాలు అందుకుంటారు.

రాత పరీక్ష ఎలా ఉంటుందంటే?

మొత్తం 200 మార్కులకు గానూ ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలకు ఈ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం ఐదు విభాగాల నుంచి ప్రశ్నలొస్తాయి. రీజనింగ్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లిష్‌ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగం నుంచి 50 ప్రశ్నలు 50 మార్కుల చొప్పున కేటాయించారు. నెగటివ్‌ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైతే ఆకర్షనీయమైన వేతనంతో ప్రభుత్వ బ్యాంకులో కొలువు సంపాదించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad