Homeచిత్ర ప్రభDaggubati Family Case: దగ్గబాటి ఫ్యామిలీపై కేసు.. క్లారిటీ ఇచ్చిన లీగల్‌ టీం

Daggubati Family Case: దగ్గబాటి ఫ్యామిలీపై కేసు.. క్లారిటీ ఇచ్చిన లీగల్‌ టీం

Daggubati Family Case: దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబంపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్‌ 10వ తేదీకి ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది. ఈ విషయాన్ని దగ్గుబాటి లీగల్‌ టీం వెల్లడించింది. గతంలో మాదిరిగానే రాబోయే విచారణకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసినట్టు తెలిపింది. అయితే విచారణ సమయంలో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని లీగల్ టీమ్ పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రత్యర్థులు, కొన్ని వర్గాలు దీనిపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తప్పుదోవ పట్టించేందుకు ఇలా చేస్తున్నారని తెలిపింది.

- Advertisement -

అసలు కేసు ఏంటంటే?
ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలు ఏవైనా వార్తలు ప్రచురించే ముందు కోర్టు ఆదేశాలను పరిశీలించడం, దగ్గుబాటి కుటుంబం న్యాయ సలహాదారుని సంప్రదించి ప్రచురించాలని లీగల్ టీమ్ విజ్ఞప్తి చేసింది. గతంలో దగ్గుబాటి వెంకటేష్‌ కుటుంబ సభ్యులపై ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైన సంగతి తెలిదే. ఫిలింనగర్‌ రోడ్డునెంబర్‌–1లో ఉన్న దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో బాధితుడు నందకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు, దగ్గుబాటి వెంకటేష్‌ , దగ్గుబాటి రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు ఫిలింనగర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 2022 నవంబర్‌లో దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు.

దక్కన్ కిచెన్ కూల్చివేత
నందకుమార్‌కు చెందిన దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం ఉంది. నందకుమార్‌ సిటీ సివిల్‌ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ అంశంలో స్టేటస్‌ కో కొనసాగించాలని.. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ గతేడాది జవనరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్‌ను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో మరోసారి బాధితుడు నందకుమార్‌ దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లి న్యాయస్థానం ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఫిలింనగర్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: Chiranjeevi: రామ్‌ చరణ్‌ గాయంపై స్పందించిన చిరంజీవి.. ట్వీట్‌ వైరల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News