ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ అనే కీలక పాత్రలో మళయాళ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన సంగతి తెలిసిందే. అయితే తొలుత ఈ పాత్ర కోసం తెలుగు హీరో నారా రోహిత్ను(Nara Rohith) మూవీ యూనిట్ సంప్రదించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్ ఈ విషయాలు వెల్లడించారు.
‘‘కొవిడ్ సమయంలో మీసాలతో ఒక ఫొటోను సిద్ధం చేసి నాకు పంపారు. నిర్మాత ఆ పాత్ర గురించి మాట్లాడారు. ఆ తర్వాత సుకుమార్ కూడా దీనిపై నాతో చర్చించారు. అయితే, ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలి కాబట్టి.. అన్ని భాషల్లో నటులు ఉండాలని ఆ పాత్రలో ఫహాద్ ఫాజిల్ను తీసుకున్నారు’’ అని తెలిపారు. కాగా ప్రస్తుతం నారా రోహిత్ నటించిన ‘భైరవం’మూవీ ఈనెల 30న విడుదల కానుంది. మూవీలో బెల్లకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.